Saturday, May 18, 2024

HYD: వజీర్‌ ఎక్స్‌ క్రిప్టో కరెన్సీ లో ఈడీ దాడులు

లోన్‌యాప్స్‌ కేసులో వజీర్‌ ఎక్స్‌ క్రిప్టో  కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని కంపెనీ డైరక్టర్ల ఇండ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. రూ.2790 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు సంబంధించి వజీర్‌ ఎక్స్‌ సంస్థకు ఈడీ ఇప్పటికే నోటీసులు జారీచేసింది. సంస్థ డైరెక్టర్లు నిశ్చల్‌ శెట్టి, సమీర్‌ హనుమాన్‌కు తాఖీదులు పంపించింది. బిట్‌కాయిన్‌, ట్రాన్‌, లిట్‌కాయిన్‌, రిప్పల్‌ వంటి డిజిటల్‌ కరెన్సీల రూపంలో లావాదేవీలను నిర్వహిస్తున్నట్లు కంపెనీపై ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement