Tuesday, May 21, 2024

తిరుప‌తిలో భూ ప్రకంపనలు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం

తిరుపతికి అతి సమీపంలో భూమి కంపించింది. తిరుపతి దొరవారిసత్రంతో పాటు సమీప గ్రామాల్లో భూకంపం సంభ‌వించింది. ఇండ్ల‌లోని వ‌స్తువులు ఒక్క‌సారిగా కిందపడిపోయాయి. దీంతో ప్ర‌జ‌లు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత స్పల్పంగా నమోదవ్వడం, ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం కూడా జరక్కపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. భూకంప తీవ్ర‌త రెక్టార్ స్కేల్ పై ఎంత న‌మోదైంద‌ని అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే టర్కీలో భూకంపం సంభవించి వేలాది మంది మృతి చెందిన ఘటన మరువకముందే తిరుప‌తిలో భూకంపం రావ‌డంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement