Thursday, May 2, 2024

Earthquake – తమిళనాడులో భూకంపం – భయంతో పరుగులు తీసిన జనం

తమిళనాడులోని చెంగల్పట్లులో భూకంపం సంభవించింది. ఈరోజు తెల్లవారిన తర్వాత ఉదయం 7.39 గంటలకు భూకంపం సంభవించినట్లు సమాచారం. ఇది రిక్టర్ స్కేల్ మీద 3.2 తీవ్రత నమోదైంది. దీంతో వెంటనే ప్రజలు ఇళ్లలో నుంచి బైటకు పరుగులు పెట్టారు.

అస్సలు ఏంజరిగిందో కూడా చాలాసేపు ఎవరికి అర్థంకానీ పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురైనట్లు తెలుస్తోంది. అయితే.. ఈ మేరకు చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం బులెటిన్ విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement