Friday, April 26, 2024

Earth Quake – అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో భూకంపం…

అరుణాచల్ ప్రదేశ్ లో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. 8.15 గంటలకు ఒక్క సారిగా చాంగ్లాంగ్ కు ఆగ్నేయంగా 86 కిలోమీటర్ల దూరంలో భూప్రకంపనలు వచ్చాయి. అయితే దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.5గా నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. కాగా.. ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టమూ సంభవించలేదు. భూకంప కార్యకలాపాలను పర్యవేక్షించే నోడల్ ఏజెన్సీ ఎన్ సీఎస్ ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. ‘‘22వ తేదీ, సోమవారం భారత కాలమాన ప్రకారం 8.15 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.5గా నమోదు అయ్యింది’’ అని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement