Tuesday, March 26, 2024

Awards – మోడీకి ఒకే రోజు రెండు దేశాల అత్యున్న‌త పుర‌స్కారాలు

భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఒకే రోజు రెండు దేశాల అత్యుతన్న పురస్కారాలు లభించాయి. ఫిజీ దేశం ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘‘కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’’తో సత్కరించగా.. పపువా న్యూ గినియా ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘‘కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లోగోహు’’ను ప్రదానం చేసింది. తొలుత ఫిజీ ప్రధానమంత్రి సితివేని రబుకా ‘‘ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’’తో మోడీని సత్కరించారు. ప్రధాని మోడీ ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా ఫిజీ ఈ పురస్కారం అందించింది. ఫిజియేతరులు కొద్దిమంది మాత్రమే ఈ గౌరవాన్ని అందుకున్నారు.
మరోవైపు పపువా న్యూ గినియా భారత ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘‘కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లోగోహు’’ను ప్రదానం చేసింది. పపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ సర్ బాబ్ దాడే ఈ పురస్కారాన్ని ప్రధాని మోడీకి బహుకరించారు. ఈ అవార్డును స్వీక‌రించిన ప్ర‌ముఖుల‌లో మోడీ ఒక‌రు.

Advertisement

తాజా వార్తలు

Advertisement