Thursday, April 25, 2024

రూ.2వేల నోట్ల మార్పిడిపై ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ కీలక వ్యాఖ్యలు

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.2 వేల నోట్లు మార్చుకోవడానికి తొందర పడొద్దని సూచించారు. రూ.2 వేల నోట్లు మార్పిడి కోసం నాలుగు నెలల సమయం ఉందని శక్తికాంతదాస్ తెలిపారు. నోట్ల మార్పిడి నేపథ్యంలో బ్యాంకుల వద్ద రద్దీ తగ్గించడానికి సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చామని పేర్కొన్నారు. లావాదేవీలపై యథావిధిగా నిఘా ఉంటుందని ఆయన వెల్లడించారు.


సెప్టెంబ‌ర్ 30 త‌ర్వాత కూడా 2వేల నోటు చెలామ‌ణి అవుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇప్పుడే బ్యాంకుల‌కు పోటెత్తాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఇంకా నాలుగు నెల‌ల స‌మ‌యం ఉంద‌ని ఆయ‌న అన్నారు. సెప్టెంబ‌ర్ 30వ తేదీనే ఎందుకు డెడ్‌లైన్‌గా పెట్టామ‌న్న విష‌యాన్ని ఆయ‌న చెబుతూ.. ఆ తేదీని సీరియ‌స్‌గా తీసుకుని ప్ర‌జ‌లు ఆ నోట్ల‌ను వెన‌క్కి ఇచ్చేస్తార‌న్న ఉద్దేశంతో ఆ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ వెల్ల‌డించారు. నోట్ల ర‌ద్దు ప్ర‌క‌టించిన త‌ర్వాత ఏర్ప‌డిన లోటును పూడ్చేందుకు రెండు వేల నోట్ల‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు ఆర్బీఐ చీఫ్ తెలిపారు. 2వేల నోట్ల‌ను వెన‌క్కి తీసుకునేందుకు కావాల్సిన అన్ని వ‌స‌తుల్ని బ్యాంకులు ఏర్పాటు చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. అవ‌స‌ర‌మైన‌న్ని ఇత‌ర డినామినేష‌న్ల క‌రెన్సీ నోట్లు అందుబాటులో ఉన్నాయ‌ని, ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న నోట్ల క‌న్నా ఎక్కువ సంఖ్య‌లో ఆ నోట్లు ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇప్ప‌టికే ఆ నోట్ల‌ను ప్రింట్ చేసిన‌ట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement