Wednesday, May 1, 2024

AP | 19న బియ్యం, గోధుమలకు ఈ-వేలం

అమరావతి, ఆంధ్రప్రభ: బియ్యం, గోధుమలు ఓపెన్‌ మార్కెట్‌ సేల్‌ స్కీమ్‌ (డొమెస్టిక్‌) ఈ- వేలంను ఈనెల 19న నిర్వహించనున్నట్లు ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఏపీ జనరల్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌ జోషి సోమవారం తెలిపారు. గోధుమలు, బియ్యం రిటైల్‌ ధరలలో ద్రవ్యోల్బణ ధోరణిని స్థిరీకరించడానికి ఓపెన్‌ మార్కెట్‌ సేల్‌ స్కీమ్‌ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. 1,400 మెట్రిక్‌ టన్నుల గోధుమలు, 7,000 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఈ వేలంలో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల మిల్లర్స్‌, ఉత్పత్తి దారులు ఈ వేలంలో పాల్గొనేందుకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్‌ వీఏఎల్‌యుఈజెయుఎన్‌సిటిఐఓఎన్‌ డాట్‌ ఇన్‌.ఎఫ్‌సీఐ ఎం-జంక్షన్‌ను సంప్రదించాల్సిందిగా సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement