Wednesday, May 1, 2024

Tirumala | 18న శ్రీవారి అర్జిత సేవా టికెట్ల కోటా విడుదల..

తిరుమల , ప్రభన్యూస్: భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ‘టీటీడీ షెడ్యూల్‌ ప్రకారం తిరుమల శ్రీవారి అర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్‌ నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన అర్జిత సేవల ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ కోసం మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 20 వ తేది ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు.

లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, అర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను ఈనెల 21 వ తేది ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అక్టోబర్‌ నెల అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈనెల 24 వ తేది ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. భక్తులు ఈవిషయాలను గమనించి తిరుపతిబాలాజి.ఏపి.జివోవి.ఇన్‌ వెబ్‌సైట్‌లో సేవా టికెట్లను బుక్‌చేసుకోవాలని కోరడమైనది.

Advertisement

తాజా వార్తలు

Advertisement