Sunday, May 5, 2024

BREKING: డ్ర‌గ్స్ విక్ర‌యిస్తున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్​లో డ్రగ్స్​ విక్రయాలపై నిఘా వేశారు. ఇటీవల కాలంలో చాలా చోట్ల డ్రగ్స్​ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా హైద‌రాబాద్‌లోని ఎల్బీ నగర్​లో డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.

న్యూఇయర్ వేడుకలలో విక్రయించేందుకు ముగ్గురు సభ్యుల ముఠా ప్రయత్నాలు చేస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకున్నారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. నిందితుల నుంచి 15 గ్రాముల హెరాయిన్, రూ. 10వేలు, ఒక బైక్, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీన చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement