Saturday, May 4, 2024

దోస్త్‌ రిపోర్టింగ్‌ గడువు పొడిగింపు.. 28 నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్‌ తరగతులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దోస్త్‌లో సీటు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేసే గడువును పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ తెలిపారు. మూడో విడతలో సీటు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్‌ చేసుకునేందుకు ఈనెల 26 నుంచి 28 వరకు రిపోర్టింగ్‌ చేసుకోవాలని తెలిపారు.

అలాగే మొదటి, రెండు, మూడో విడతలో సీటు పొంది.. ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్‌ చేసిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో నేరుగా రిపోర్టింగ్‌ చేసుకోవడానికి ఈనెల 26 నుంచి 28 వరకు గడువిస్తున్నట్లు తెలిపారు. డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ తరగతులు కూడా 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు వారు బుధవారం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement