Sunday, May 5, 2024

క్యాన్స‌ర్ రోగుల కోసం నంద‌మూరి ఫ్యామిలీకి వీరాభిమాని.. ఏం చేశాడో తెలుసా

అభిమానం వేరు .. వీరాభిమానం వేరు. ఈ వీరాభిమానులు తాము ఆరాధించే న‌టుల‌కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధ‌ప‌డుతుంటారు. కాగా 50ఏళ్ల జ‌నార్థ‌న్ నంద‌మూరి ఫ్యామిలీకి వీరాభిమాని. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు నందమూరి కుటుంబానికి వీరాభిమాని. తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆయన షోల్డర్ ఆర్థరైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నారు. అయితే తన అనారోగ్యాన్ని ఏ మాత్రం లెక్కచేయకుండా క్యాన్సర్ రోగుల కోసం ఆఫ్రికాలోని టాంజానియాలో ఉన్నఅత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారాయన. మైనస్‌ డిగ్రీల్లో ఉష్ణోగ్రత, 30 శాతం ఆక్సిజన్‌ ఉన్నప్పటికీ క్యాన్సర్‌ బాధితులకు నిధుల సేకరణ లక్ష్యంగా పర్వతాన్ని ఎక్కి ఎంతో సాహసానికి పూనుకున్నారు. సుమారు 7 రోజుల పాటు ఈ సాహసయాత్ర కొనసాగింది.కాగా క్యాన్సర్‌ రోగుల కోసం ఎంతో రిస్క్‌ చేసిన ఆయనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేసేలా ఆయన్ని భగవంతుడు ఆశీర్వదించాలంటూ కోరుతున్నారు.

కాగా తానా, బసవతారకం సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ ని నిర్వహించినట్లు జనార్ధన్‌ తెలిపారు. దీనికి మంచి స్పందన వచ్చందని ఇప్పటివరకు కోటి రూపాయల వ‌ర‌కు ఫండ్స్‌ వచ్చాయంటున్నారు. ఈ డబ్బుతో క్యాన్సర్ రోగుల చికిత్సకు కావాల్సిన అధునాతన పరికరాలు కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ‘రెండేళ్లలో మరో ప్రాజెక్ట్ కు రెడీ అవుతున్నాం. ఈసారిలా ఒకే హాస్పిటల్ కి కాకుండా వివిధ హాస్పిటల్స్ కి ఫండ్స్ రైజ్ చేద్దామని అనుకుంటున్నాం. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్న చిన్న పిల్లలకి హార్ట్ సర్జరీలు చేయించాలని భావిస్తున్నాం. 2024 డిసెంబర్ కల్లా సుమారు రూ. 2 కోట్లు సేకరించి పిల్లలకు హార్డ్‌ సర్జరీలు చేసే ప్లాన్‌లో ఉన్నాం. ఇక తెలంగాణలో చేసినట్టే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సేవా కార్యక్రమాలు ప్రారంభించాలనుకుంటున్నాం’ అని జనార్ధన్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement