Sunday, April 28, 2024

America: కలవరపెడుతున్న విద్యార్థుల మరణాలు… అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి

అమెరికాలో వరుసగా భారతీయ విద్యార్థుల మరణాలు కలవరపెడుతున్నాయి. అగ్రరాజ్యంలో ఉన్నత విద్యకు వెళ్లిన విద్యార్థులు వరుసగా మృతి చెందుతున్నారు. వారం రోజుల్లోనే నలుగురు విద్యార్థులు మృతిచెందడం ఆందోళనకు గురిచేస్తోంది.

తాజాగా, శ్రేయాస్‌రెడ్డి బెనిగెరి అనే మరో విద్యార్థి ఒహియోలోని సిన్సినాటిలో చనిపోయి కనిపించాడు. అమెరికాలో భారతీయ విద్యార్థి చనిపోవడం ఈ వారంలో ఇది మూడోసారి. అయితే, శ్రేయాస్‌రెడ్డి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, శ్రేయాస్ లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుతున్నట్టు తెలుస్తోంది. అతడి మృతిపై న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రగాఢ సానుభూతి తెలిపింది. బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందిస్తామని పేర్కొంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement