Sunday, May 5, 2024

National : విపత్తులు తీవ్రంగా మారాయి…ఎంతో నష్టం వాటిల్లుంది.. పీఎం మోదీ

విపత్తులు తీవ్రంగా మారాయని, వాటి వల్ల ఎంతో నష్టం వాటిల్లుందని ప్ర‌ధాని మోదీ తెలిపారు. ఇంటర్నేషనల్ కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో మోడీ వర్చువల్‌గా ప్రసంగించారు.

ప్రకృతి వైపరీత్యాలు తరచుగా సంభవించి మానవులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ప్రకృతి, విపత్తులను సరిహద్దులు లేవని, ఎప్పుడు ఏ ప్రాంతంలో సంభవిస్తాయో ఊహించలేమని తెలిపారు. అనేక ఇండ్లు ధ్వంసమవడంతో పాటు వేలాది మంది నిరాశ్రయులవుతున్నారని చెప్పారు.

- Advertisement -

కాబట్టి విపత్తులను తట్టుకునే సదుపాయాలపై ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలని సూచించారు. విపత్తు తర్వాత తక్షణ దృష్టి సహజంగానే ఉపశమనం, పునరావాసంపై ఉంటుందని, కానీ దీంతో పాటు మౌలిక సదుపాయాలపై కూడా దృష్టి పెట్టాలన్నారు. దేశాలు వ్యక్తిగతంగా దృఢంగా ఉన్నప్పుడు ప్రపంచం కూడా సమిష్టిగా మనుగడ సాధించగలుగుతుందని నొక్కి చెప్పారు. చిన్న ద్వీప దేశాలకు మద్దతివ్వాలని స్పష్టం చేశారు. ఐసీడీఆర్ఐ ప్రారంభించినప్పటి నుంచి భారత్ ఒకే వైఖరిని కలిగి ఉందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement