Wednesday, May 1, 2024

భూ సమస్యల పరిష్కారానికే ధరణి పోర్టల్‌.. పైలెట్‌ ప్రాజెక్టు ములుగు మండలం..

గజ్వేల్‌, (ప్రభ న్యూస్‌): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధరణి అనే విప్లవాత్మక మార్పు తీసుకురావడంతో అద్భుతమైన ప్రయోజనాలు కలిగాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ములుగు రైతు వేదికలో ధరణి అవగాహన సదస్సు, రైతులతో ధరణి సమస్యలపై అడిగి తెలుసుకొని మంత్రి మాట్లాడారు. గతంలో ఎల్‌ఆర్‌ యూపీ ద్వారా కొన్ని భూ సమస్యలు మిగిలిపో యాయని, ఆ సమస్యలు మీ దగ్గరికి వచ్చి అర్థం చేసుకొని ఒక్క భూ సమస్య లేకుండా పరిష్కార దిశగా సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ములుగులో ధరణిపై అవగాహన సదస్సు చేపట్టామన్నారు. ధరణి అనేది ఒక అద్భుతం, విప్లవాత్మక మైన చర్య అని, ఆ ధరణిలో నెలకొన్న భూ సమస్యలు ఏమిటి, ధరణికి ముందు గత అధికారులు ఎల్‌ఆర్‌యూపీలో కొన్ని భూ సమస్యలు ధరణిలో ఎక్కనందున, ఎదురైన అవాంతరాలు తప్పుగా ఎక్కడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయని, అలా ఎదురైన భూ సమస్యలకు పరిష్కారం చూపేలా ఎలాంటి భూ సమస్య లేకుండా చూపాలన్నదే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు. ధరణిలో నెలకొన్న చిన్నచిన్న సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారన్నారు. ములుగు మండలాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకొని వంద శాతం రైతుల భూ సమస్యలు పరిష్కరించనున్నామన్నారు. రైతుల భూ సమస్యల పరిష్కారం కోసమే సీఎం కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ తీసుకువచ్చారని, ఇది అతిపెద్ద కార్యక్రమం అని, కొన్ని సాంకేతిక సమస్యలతో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. రైతుల భూముల విషయంలో తరతరాలు ఎదుర్కుంటు న్న సమస్యలు ధరణి ద్వారా పరిష్కారం అయ్యాయన్నారు. కోర్టు కేసులు, కుటుంబ తగాదాల వల్ల కొన్ని భూ సమస్యలు పెండింగ్‌లో పడ్డాయని, కోర్టు కేసులు కాకుండా వ్యక్తిగత సమస్యలు లేకుండా ఉన్న ప్రతి భూ సమస్యను పరిష్కరించడానికి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.

పైలెట్‌ ప్రాజెక్టుగా ములుగు మండలంలో వందశాతం సమస్యలు పరిష్కరించి రైతులకు దృవీకరణ పత్రాలు అందజేస్తా మన్నారు. ములుగు తర్వాత ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో చేపడతామన్నారు. టైం బౌండ్‌ ప్రోగ్రాంతో ఈ కార్యక్రమాన్ని వంద శాతం అన్ని గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కరిస్తా మని, ఎవరూ ఆందోళన చెందవద్ద న్నారు. రైతులెవరూ తమ సమస్యల పరిష్కారం కోసం పైరవీకారులను ఆశ్రయించవద్దని, డబ్బులు ఇవ్వవద్దన్నారు. రైతుల భూములకు వందేళ్ళ వరకు కూడా పూర్తి భద్రత ఉంటుందని, ధరణి ద్వారా అనేక అక్రమాలకు చెక్‌ పడి భూమిపై పూర్తి హక్కు కల్పించబడిందన్నారు. రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ ధరణి ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం అని, సీఎం కేసీఆర్‌ ఈ కార్యక్రమాన్ని స్వయంగా రూపొందించారని, నిజమైన భూ యజమానులకు భూమిపై పూర్తి హక్కు కల్పించాలని, భూమి బదిలీ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నదే ధరణి ఉద్దేశ్యం అన్నారు. ధరణి పోర్టల్‌ ఇప్పటి వరకు 7 కోట్ల మంది ఉపయోగించుకున్నారని, భూముల అమ్మకాలు, కొనుగోళ్లు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. పూర్తి పారదర్శకంగా ధరణి రిజిస్ట్రేషన్‌లు 15 నిమిషాల్లో పూర్తవుతున్నాయన్నారు. ధరణి పోర్టల్‌లో ఎలాంటి సమస్య లేదని, సాంకేతిక సమస్యలే కొన్ని ఉన్నాయన్నా రు. ధరణిలో కొత్తగా మరో 33 మ్యాడ్యూ ల్స్‌ చేర్చామని, వీటి ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయన్నా రు. ఇతర చిన్న చిన్న సమస్యలు కూడా వంద శాతం పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారన్నారు. ములుగు మండలం నుండి ఈ కార్యక్రమాన్ని పైలెట్‌గా ప్రారంభించామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ సదస్సులు నిర్వహించి ప్రతి గ్రామంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామని అన్నారు. ఈ మేరకు పలువురు భూ సంబంధిత బాధ్యులు ధరణిలో ఎదుర్కుంటున్న భూ సమస్యలను సదస్సులో మంత్రి హరీశ్‌రావు, చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌ల దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ కార్యాలయ కార్యదర్శి స్మితాసబ ర్వాల్‌, శేషాద్రి, రాహుల్‌బొజ్జా, టీఎస్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రావు, సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, అడిషనల్‌ కలెక్టర్లు ముజామిల్‌ ఖాన్‌, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement