Saturday, May 18, 2024

కేసీఆర్‌ పాలనలో దేవాలయాల అభివృద్ధి : మంత్రి గంగుల

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం కరీంనగర్ పట్టణంలోని 24వ డివిజన్ లో హనుమాన్ దేవాలయం అభివృద్ధి పనులకు మంత్రి గంగుల భూమి పూజ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ప్ర‌త్యేకంగా 20 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ కుర్ర తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement