Tuesday, May 21, 2024

IPL | టాస్ గెలిచి ఫీల్గింగ్ ఎంచుకున్న ఢిల్లీ

ఐ పీఎల్ 2023సీజన్‌లో ఇవ్వాల రాత్రి 28వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే.. ఈ మ్యాచుకి వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో.. టాస్ మరింత ఆలస్యం కావడంతో మ్యాచ్ లేట్ గా ప్రారంభం అయింది. ఇక ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది.

అయితే, ఇప్పటివరకు అన్ని జట్లు కనీసం రెండు మ్యాచ్ లలో అయినా విజయాలు సాధించగా.. వార్నర్‌ సేన ఇప్పటివరకు బోణీ కూడా కొట్టలేదు. ఆడిన ఐదు మ్యాచ్ లలో వరుసగా 5 మ్యాచ్‌లో ఓడిపోయి ప్లేఆఫ్స్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే ఢిల్లీ జట్టు గెలుపు బాట పట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో వార్నర్‌ సేన ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement