Monday, May 27, 2024

Delhi | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రష్యా ఆహ్వానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రష్యాలో వచ్చే ఏడాది జరగనున్న ‘4వ లెట్స్ ట్రావెల్ రష్యా టూరిజం ఫోరం’ సదస్సుకు హాజరు కావాలంటూ ఆ దేశ ప్రభుత్వం భారత సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి ఆహ్వానం పలికింది. రష్యా రాజధాని మాస్కోలో వచ్చే ఏడాది జూన్‌లో జరిగే ఈ సదస్సుకు రావాలంటూ.. ఆ దేశ ఆర్థిక శాఖ సహాయ మంత్రి దిమిత్రి వఖ్రుకోవ్.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు.

భారత్-రష్యా మధ్య ఉన్న బలమైన సాంస్కృతిక, పర్యాటక బంధాన్ని వఖ్రుకోవ్ గుర్తుచేస్తూ.. పర్యాటక, వ్యాపార రంగాల్లో భారతదేశం సామర్థ్యాన్ని తెలియజేయడానికి ఇదొక మంచి వేదిక అని అందుకే ఈ కార్యక్రమంలో వ్యక్తిగతంగా పాల్గొనాలని కిషన్ రెడ్డిని కోరారు. ఈ వేదిక ద్వారా భారతదేశ పర్యాటక, సాంస్కృతిక సామర్థ్యాన్ని, సంప్రదాయాలను. రష్యా పర్యాటకులకు తెలియజేసేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement