Thursday, May 2, 2024

వైసీపీ ఎన్నారై సభ్యుడు పంచ్ ప్రభాకర్‌పై కేసు నమోదు

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే వైసీపీ ఎన్నారై సభ్యుడు పంచ్ ప్రభాకర్‌పై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఎంపీ రఘురామకృష్ణరాజు తదితర ప్రముఖులపై పంచ్ ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్నాడంటూ వచ్చిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు స్పందించారు.

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. యూట్యూబ్‌లో వీడియోలు పోస్టు చేసిన వ్యవహారంలో తాజా కేసు నమోదైంది. స్థానిక కోర్టు అనుమతితో ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు యూట్యూబ్ నిర్వాహకులకు కూడా నోటీసులు జారీ చేశారు. పంచ్ ప్రభాకర్ వీడియోలపై పూర్తి సమాచారం అందించాలని ఆదేశించారు.

ఈ వార్త కూడా చదవండి: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు గుండెపోటు

Advertisement

తాజా వార్తలు

Advertisement