Monday, May 6, 2024

Delhi | రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కేంద్ర నిధులు.. రూ.25 కోట్లు చొప్పున మంజూరు

న్యూఢిల్లీ,  ఆంధ్రప్రభ : తెలంగాణలోని మూడు రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని ఖమ్మం ఎంపీ, బీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు తెలిపారు. ఈమేరకు శనివారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం, మధిర, కొత్తగూడెం రైల్వేస్టేషన్ల అభివృద్ధికి నిధులు విడుదలయ్యాయని చెప్పారు. ఒక్కో రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.25 కోట్లు చొప్పున నిధులు కేటాయించినట్టు తెలిపారు.

- Advertisement -

ఖమ్మం జిల్లాలోని మిగతా రైల్వే  స్టేషన్ల అభివృద్ధికి కూడా ఒక్కో దానికి రూ.10 కోట్లు చొప్పున మంజూరుకు  రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ హామీ ఇచ్చారని  నామ ప్రకటనలో పేర్కొన్నారు. తాను పలుమార్లు రైల్వే మంత్రితో భేటీ అయి, సమస్యలపై వినతిపత్రాలు సమర్పించినట్టు ఆయన వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement