Wednesday, May 1, 2024

ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప‌ట్టుబ‌డిన.. గోల్డ్ స్మ‌గ్ల‌ర్

ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టులో ఓ గోల్డ్ స్మ‌గ్ల‌ర్ ప‌ట్టు బ‌డ్డాడు. అత‌డి వ‌ద్ద నుండి 14మంగారు బిస్కెట్ల‌ను క‌స్ట‌మ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బహ్రెయిన్‌ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చిన అతని తీరు అనుమానాస్పదంగా అనిపించడంతో కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. అతని లగేజీని చెక్‌ చేయగా 14 బంగారు బిస్కెట్‌లు లభ్యమయ్యాయి. వాటి మొత్తం బరువు 1483 కిలోలు ఉన్నదని, వాటి విలువ సుమారుగా రూ.68.71 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారాన్ని సీజ్‌ చేసి, నిందితుడి అరెస్ట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement