Monday, April 15, 2024

విభజన కంటే జగన్ పాలనతోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం.. చంద్ర‌బాబు

విభ‌జ‌న కంటే జ‌గ‌న్ పాల‌న‌తోనే రాష్ట్రానికి ఎక్కువ న‌ష్టం జ‌రిగింద‌ని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు అన్నారు. ఏపీలో రైతుల ఆత్మహత్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరగడం ఆందోళనకరమన్నారు. మద్ధతు ధర లేకపోవడం, సబ్సిడీలు నిలిచిపోవడమూ ఇందుకు కారణమని ఆరోపించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా మళ్లీ సమైక్య రాష్ట్రం అంటూ ప్రభుత్వం ప్రకటనలా అని ప్రశ్నించారు. ఏపీకి రావాల్సిన నిధులపై వైసీపీ ప్రభుత్వం నోరెత్తడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని చంద్రబాబు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement