Wednesday, April 17, 2024

పవన్ వాహనం వారాహి కాదు.. నారాహి .. మంత్రి ఆర్.కే.రోజా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం వాహనం వారాహి కాదు.. నారాహి అని ఏపీ మంత్రి ఆర్.కే.రోజా విమర్శించారు. శనివారం తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ సమీకృత సుస్ధిర పర్యాటక ప్రణాళిక, అభివృద్ధిపై జరిగిన సౌత్ జోన్ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీ‌ పర్యాటక శాఖా మంత్రి ఆర్.కే.రోజా హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆమె మాట్లాడుతూ… జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు.

రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారని, పర్యాటక రంగంలో ఏపీ మూడో స్థానంలో ఉందని ఏపి పర్యాటక శాఖా మంత్రి రోజా తెలియజేశారు. 2023లో పర్యాటక రంగంలో ఏపీని మొదటి స్థానంలో నిలుపుతామన్నారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో తీర ప్రాంతాల అభివృద్ధి చేస్తామని, రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయని, కొత్త జనరేషన్ పర్యాటక ప్రాంతాలు పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారని మంత్రి రోజా తెలిపారు. ఐటిపిఐ సలహాలు, సూచనలు తీసుకుని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్న మంత్రి రోజా.. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ వాహనం వారాహి కాదు అది నారాహి అని రోజా ఎద్దేవా చేశారు. కత్తులతో పవన్ ఎవరిపై యుద్ధం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడని, ఎవరి సైన్యంలోనో దూరి యుద్ధం చేయాలని పవన్ చూస్తున్నట్లు ఉందని, వారాహి రంగుపై పవన్ కళ్యాణ్ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement