Monday, April 29, 2024

ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్‌గా డా. ఎం. శ్రీనివాస్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలోని ప్రఖ్యాత వైద్యవిద్యా సంస్థ ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరక్టర్‌గా డా. ఎం. శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ డీన్‌గా డాక్టర్ శ్రీనివాస్ పనిచేస్తున్నారు.

ఇప్పటి వరకు ఎయిమ్స్ డైరక్టర్‌గా పనిచేసిన డా. రణ్‌దీప్ గులేరియా పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. డా. శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టేవరకు గులేరియా పదవిలో ఉంటారు. డా. శ్రీనివాస్ వయస్సు 65 ఏళ్లు పూర్తయ్యేవరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఎయిమ్స్ డైరక్టర్‌గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement