Friday, April 26, 2024

తాడ్వాయి అడవుల్లో జింకల వేట..

ములుగు జిల్లాలోని తాడ్వాయి నుండి మేడారం వెళ్లే దారి మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు బాణాలతో జింకపై దాడి చేశారు. వేటగాళ్ళ బాణాలకు జింక తీవ్రంగా గాయపడింది. తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన పడి ఉన్న జింకను చూసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు మేడారం భక్తులు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు జింకను వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందించారు. ఆ తరువాత జింకను వరంగల్ జూ పార్క్ కి తరలిచారు ఫారెస్ట్ అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement