Thursday, April 25, 2024

ఇండియాలో తగ్గుతున్న కరోనా…కొత్తగా 1,32,364 కేసులు

దేశంలో కరోనా కేసులు క్రమేణా తగ్గుతున్నాయి. తాజాగా గ‌డిచిన 24గంటల్లో 1,32,364 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఈ మహమ్మారి కారణంగా 2713 మంది మృతి చెందారు. అలాగే కొత్త‌గా 2,07,071మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,85,74,350కి చేరింది. అలాగే 2,65,97,655 మంది కొలుకున్నారు. మరోవైపు మహమ్మారి కారణంగా 3,40,702 మంది మృతి చెందారు. ప్రస్తుతం 16,35,993 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదు అయిన కేసుల్లో త‌మిళ‌నాడులో అత్య‌ధికంగా 24,405, కేర‌ళ‌లో 18,853, క‌ర్ణాట‌క‌లో 18,324, మ‌హారాష్ట్రలో 15,229, ఏపీలో 11,421 కేసులు నమోదు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement