Wednesday, May 1, 2024

పవన్ కళ్యాణ్ ట్వీట్‌పై తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తావన

జనసేన అధినేత పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కు ఢిల్లీ నుంచి గల్లీ వరకు అభిమానులు ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోనూ ఆయనకు ఫాలోయింగ్ ఉంటుంది. తాజాగా పవన్‌ కళ్యాణ్‌ చేసిన ఓ ట్వీట్‌ పై తమిళనాడు అసెంబ్లీలో చర్చ జరిగింది. శాసన సభలో ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్‌ ప్రసంగిస్తూ ఈ ట్వీట్‌ గురించి ప్రస్తావించారు. ప్రతి పక్షం, అధికార పక్షం అనే తేడా లేకుండా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ అందరినీ భాగస్వాములను చేస్తూ వారికి సముచిత గౌరవం కలిపిస్తూ.. పరిపాలన చేస్తుండడాన్ని పవన్‌ తన ట్వీట్‌‌లో ప్రశంసించారు.

ఈ ట్వీట్ గురించి మంత్రి సుబ్రమణియన్ వివరిస్తూ.. అధికారంలోకి రావడానికి రాజకీయాలు చేయాలే తప్ప… అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదనే మాటలను తాము చేతల్లో చూపిస్తున్నానని తమిళంలోపాటు తెలుగులోనూ తెలిపారు. దీంతో పవన్ కల్యాణ్ ట్వీట్‌పై తమిళనాడు అసెంబ్లీలో జరిగిన చర్చ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వార్త కూడా చదవండి: విజయసాయిరెడ్డి తిన్నదంతా కక్కిస్తా: బుద్దా వెంకన్న సవాల్

Advertisement

తాజా వార్తలు

Advertisement