Friday, April 26, 2024

విజయసాయిరెడ్డి తిన్నదంతా కక్కిస్తా: బుద్దా వెంకన్న సవాల్

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. 13 కేసుల్లో ముద్దాయిగా ఉండి, రూ.43 వేల కోట్ల ఈడీ కేసుల్లో ఏ-2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి నీతి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని మండిపడ్డారు. జగదాంబ సెంటర్లో వైసీపీ చేసిన అవినీతి దందాలపై విజయసాయిరెడ్డిని చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఉత్తరాంధ్రలో ఎవరైనా భూ ఆక్రమణకు పాల్పడితే తనకు ఫిర్యాదు చేయాలని సీఎం చెబుతున్నారన్న బుద్దా వెంకన్న… విజయసాయిరెడ్డి భూ ఆక్రమణపై ఎవరికి ఫిర్యాదు చేయాలని ప్రశ్నించారు. రూ.42 వేల కోట్లు ఈడీ జప్తు చేసిన కేసుల్లో దొంగ లెక్కలు రాసింది ఆడిటర్ విజయసాయిరెడ్డి అని అందరికీ తెలుసన్నారు. విజయసాయిరెడ్డి మీడియా ముందు అవాకులు, చవాకులు పేల్చకుండా ఉంటే బాగుంటుందని హితవు పలికారు. తాము అధికారంలోకి వచ్చాక విజయసాయిరెడ్డి తిన్నదంతా కక్కిస్తామని బుద్దా వెంకన్న హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: ఏపీలో నైట్ పూట కర్ఫ్యూ కొనసాగింపు

Advertisement

తాజా వార్తలు

Advertisement