Wednesday, May 15, 2024

కరోనాతో యువకుడి మృతి.. వ‌రంగ‌ల్ జిల్లాలో ఘ‌ట‌న‌

వరంగల్ జిల్లాలో ఓ యువ‌కుడు క‌రోనాతో చ‌నిపోయిన‌ట్టు స‌మాచారం. ఖానాపూరం మండలం కోమటిపెళ్లి పరిధిలోని వేప చెట్టు తండాకు చెందిన ఇస్లావత్ మురళి (22)కి తీవ్ర‌మైన జ్వ‌రం వ‌చ్చింది. కాగా, అత‌ను హైదరాబాద్ లో కారు డ్రైవర్ గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. 15రోజుల క్రితం గ్రామానికి వ‌చ్చాడ‌ని, అప్ప‌టికే అత‌ను అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్టు గ్రామ‌స్తులు తెల‌పారు. సోమవారం నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. ప‌రిస్థితి విషమించడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్న క్రమంలో చ‌నిపోయిన‌ట్టు స‌మాచారం. మృతుడి మెడిక‌ల్ టెస్టుల‌ ప్రకారం కరోనా పాజిటివ్ ఉన్నట్లు గ్రామ‌స్తులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement