Sunday, May 19, 2024

దలైలామాకు రెస్టు.. జలుబుతో ధార్మికవేత్తకు విశ్రాంతి

జలుబు చేసిన కారణంగా ధార్మికవేత్త దలైలామా విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు ఆయనకు విశ్రాంతి అవసరమైందని తెలిపింది. అక్టోబర్‌ 2 నుంచి 4వ తేదీ వరకు తైవాన్‌ నుంచి వచ్చిన భక్తులకు దలైలామా ధార్మిక బోధనలు చేయవలసి ఉందని అయితే అనారోగ్యం కారణంగా ఆయనకు బదులుగా బోధనలు చేయాల్సిందిగా గాడెన్‌ త్రి రిన్‌పోచేను కోరినట్టు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement