Tuesday, April 30, 2024

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు, కేంద్ర కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ విడుదలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పెన్షనర్లకు డీఆర్ విడుదలకు కేంద్ర మంత్రి వర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే ఉన్న 31 శాతానికి అదనంగా మరో 3 శాతం డీఏ, డీఆర్ పెంచనుంది. ప్రభుత్వ నిర్ణయం ద్వారా 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షనార్థులు ప్రయోజనం కలగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement