Friday, May 3, 2024

National : ఇవాళ ఢిల్లీలో సీడ‌బ్ల్యూసీ స‌మావేశం…పాల్గొననున్న సీఎం రేవంత్​

ఇవాళ ఢిల్లీలో సీడ‌బ్ల్యూసీ స‌మావేశం నిర్వ‌హించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ భేటీలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు.

- Advertisement -

కాంగ్రెస్ ఈ మీటింగ్‌లో ఎన్నికల మేనిఫెస్టోకు ఆమోదం తెలపనుంది. ఇక, సీడబ్ల్యూసీ మీటింగ్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. తెలంగాణలో 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే చాన్స్ ఉంది. ఇవాళ రాత్రి లేదా.. రేపు ఏఐసీసీ నాలుగో జాబితా వెలువడే అవకాశం ఉంది. కాగా, సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల విషయంలో ప్రకటన వచ్చే అవకాశం ఉన్నందున ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement