Thursday, May 2, 2024

గోవాలో ఈ నెల 21 వరకు కర్ఫ్యూ పొడిగింపు..

గోవాలో కరోనా కర్ఫ్యూను ఈ నెల 21వ తేదీ వరకు ప్రభుత్వం పొడగించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంతి ప్రమోద్‌ సావంత్‌ కర్ఫ్యూను పొడగిస్తున్నట్లు ప్రకటించారు. 21న ఉదయం 7 గంటల వరకు కొనసాగుతుందని, ప్రస్తుతం ఉన్న ఆంక్షలు కొనసాగుతాయన్నారు. పంచాయతీ, మునిసిపల్ మార్కెట్లతో సహా దుకాణాలు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య తెరువచ్చన్నారు. వివాహ వేడుకలో పాల్గొనేందుకు 50 మందికి అనుమతి ఇస్తున్నట్లు ట్వీట్‌ గోవాలో శనివారం 472 కొత్త కరోనా కేసుల నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,62,048కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement