Tuesday, May 7, 2024

ప్రభుత్వ పాఠశాలపై నాటు బాంబుతో దాడి.. విద్యార్థులకు తప్పిన పెనుప్రమాదం!

పశ్చిమ బెంగాల్​లోని ఓ ప్రభుత్వ పాఠశాలపై నాటు బాంబుతో దాడి చేసిన ఘటన ఇవ్వాల (శనివారం) జరిగింది. అయితే.. ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగానా జిల్లాలో ఓ పాఠశాల భవనంలో నాటు బాంబు పేలుడు సంభవించిందని, గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డట్టు తెలుస్తోందని పోలీసులు ప్రాథమిక విచారణకు వచ్చారు. టిటాగర్ పాఠశాలలో తరగతులు జరుగుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఈ బాంబు పేలుడుతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. టిటాగర్ హైస్కూల్‌లో తరగతులు జరుగుతుండగా, 11 గంటల సమయంలో రూఫ్ టాప్ నుండి పేలుడు శబ్దం వినిపించిందని, సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఉపాధ్యాయులు పైకప్పు సగానికి పైగా దెబ్బతిన్నట్లు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement