Monday, April 29, 2024

టెర్ర‌రిస్టుల‌ కాల్పుల్లో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మృతి

జమ్మూ కశ్మీర్‌లోని పోషియాన్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో సీఆర్పీఎఫ్‌ జవాన్ చ‌నిపోయాడు. ఈ ఘటన త‌ర్వాత‌ భారీ సంఖ్యలో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్‌ ఆపరేషన్ చేప‌ట్టాయి. షోపియాన్‌లోని ఛోటేపోరా గ్రామంలో సెలవులో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్ ముఖ్తార్ అహ్మద్ లక్ష్యంగా టెర్ర‌రిస్టులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అత‌డిని ఆసుపత్రికి తరలిస్తుండగా దారి మ‌ధ్యలో మృతి చెందాడు. అంతకుముందు పుల్వామాలో సర్పంచ్ లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో అత‌ను తృటిలో తప్పించుకున్నాడు. కాల్పుల శబ్దం విని మరికొందరు సంఘటనా స్థలానికి చేరుకోగా.. ఉగ్రవాదులు పారిపోయారు. ఈ ఘటనపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement