Saturday, April 27, 2024

Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ కొండంత

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పోటెత్తారు. తిరుమల కొండపై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండిపోయాయి. ఎంటీవీ అన్నప్రసాద భవనం వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం దాదాపు 20 గంటలకు పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్తున్నారు. వారాంతపు సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వచ్చినట్లుగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్ర‌త్యేక ద‌ర్శ‌నం చేసుకునే వారికి దాదాపు 4 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement