Sunday, April 28, 2024

Order Order | దగ్గుబాటి సురేశ్ బాబు, రానాపై క్రిమినల్ కేసు.. భూ వివాదంలో కోర్టుకెళ్లిన బాధితుడు

టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు, ఆయన కుమారుడు, ప్రముఖ నటుడు రానాపై ఓ భూ వివాదంలో కేసు నమోదైంది. కొంతకాలంగా ప్రమోద్ కుమార్ అనే వ్యాపారవేత్తకు, సురేశ్ బాబుకు మధ్య ఈ భూమి విషయంలో వివాదం నడుస్తోంది. స్థలం ఖాళీ చేయాలని సురేశ్ బాబు, రానా దౌర్జన్యానికి పాల్పడ్డారని.. సురేశ్ బాబు తనను చంపేస్తానని బెదిరించారని ప్రమోద్ కుమార్ పోలీసులకు కంప్లెయింట్​ చేశాడు.

ఈ విషయంలో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించడంలేదని ప్రమోద్ కుమార్ నేరుగా నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. ప్రమోద్ కుమార్ ఫిర్యాదు నేపథ్యంలో క్రిమినల్ కేసు నమోదు కాగా, విచారణకు రావాలని కోర్టు సురేశ్ బాబు, రానాకు సమన్లు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement