Thursday, May 2, 2024

Crime: దారుణం.. గిరిజన మహిళపై అత్యాచారం, హత్య

నలుగురు వ్యక్తులు గిరిజన మహిళపై అత్యాచారం చేసి.. హత్య చేసిన ఘ‌ట‌న పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో చోటుచేసుకుంది. అనుపు చెంచుకాలనీకి చెందిన గిరిజన మహిళ ఆశా వర్కర్‌గా పనిచేస్తోంది. హత్య చేసిన అనంతరం దుండగులు ఆమెను గ్రామ శివారులోని వాగులో పడేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు వాగులో శవమై తేలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement