దేశంలో కరోనా వైరస్ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ షాక్ ఇస్తోంది. తాజాగా జార్ఖండ్ డైనమైట్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తల్లిదండ్రులకు కరోనా సోకింది. దీంతో వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ధోనీ తల్లిదండ్రుల పేర్లు దేవకీ దేవి, పాన్ సింగ్. ప్రస్తుతం వారికి రాంచీలోని పల్స్ అనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతోన్న ధోనీ ముంబైలో ఉన్న విషయం తెలిసిందే. కాగా బుధవారం రాత్రి ధోనీ సారథ్యం వహిస్తున్న చెన్నై జట్టు కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement