Monday, May 6, 2024

క్రికెట్ బెట్టింగ్ అయిపొయింది – ఇప్పుడు లాక్ డౌన్ పై బెట్టింగ్

మామూలుగా క్రికెట్ మ్యాచ్ లు జరిగేట్టప్పుడు బెట్టింగ్ లను చూస్తూ ఉంటాం. ఐపీఎల్ సమయంలో అయితే అది మరికాస్త ఎక్కువ అవుతుంది. మా టీం గెలుస్తుందని ఒకరు… లేదు మా టీం గెలుస్తుందని మరొకరు పోటీపడుతూ బెట్టింగ్స్ కడుతుంటారు. అయితే ఇప్పుడు కరోనా కేసులను కూడా క్యాష్ చేసుకుంటున్నారు బుకీలు. దేశంలో లాక్ డౌన్ వార్తలపై భారీగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి.

కాగా మే 2 నుంచి లాక్ డౌన్ ఉందంటూ సోషల్ మీడియా లో వార్తలు నడుస్తున్నాయి. నెల రోజుల పాటు ఈ లాక్ డౌన్ ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ తరహాలో లాక్ డౌన్ పై ఉంటుందా ఉండదా అంటూ బెట్టింగ్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిఘా పెంచారు. ఇలాంటి బెట్టింగ్స్ కు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement