Saturday, September 21, 2024

అప్పుడు ‘మిర్చి’ ఇప్పుడు ‘ఆచార్య ‘

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఇక ఇటీవల చరణ్ పూజా హెగ్డే మధ్య సాంగ్ ను చిత్రీకరించిన యూనిట్… ఇప్పుడు ఒక ఫైట్ సీన్ ను చిత్రీకరిస్తున్నారు. వర్షంలో జరిగే ఈ ఫైట్ లో రామ్ చరణ్ తో బాలీవుడ్ స్టార్ సోనూసూద్ తలపడనున్నట్లు తెలుస్తోంది.

సినిమా మొత్తానికే ఫైట్ హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. గతంలో మిర్చిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కొరటాల రెయిన్ ఫైట్ ను పెట్టించాడు. ఆ ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఇప్పుడు ఇది కూడా హైలెట్ అవుతుందని అంటున్నారు కొరటాల సన్నిహితులు. అంతేకాకుండా చిరంజీవి రెజీనా, చరణ్ పూజా మధ్య సాంగ్స్ అభిమానులలో మంచి జోష్ ని కూడా తీసుకొస్తాయని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement