Sunday, May 19, 2024

రేపటి నుంచి సీపీగెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రేపటినుంచి (సోమవారం) సీపీగెట్‌-2022 రెెండో విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. ఈనెల 17న ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం కల్పించారు. 19 నుంచి 22వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈనెల 25న అభ్యర్థులకు రెండో విడత సీట్లను కేటాయించనున్నారు. ఈనెల 26 నుంచి 30వ తేదీవరకు సీటు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుందని వర్సిటీ అధికారులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement