Friday, May 17, 2024

కరోనా తగ్గుముఖం.. దేశంలో భారీగా తగ్గిన కొత్త కేసులు

క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టింది. దేశంలో కొత్త కేసులు భారీగా త‌గ్గాయి. గ‌త వారంతో పోలిస్తే ఈ వారం కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గుతూ వ‌స్తోంది. తాజాగా దేశంలో 5554 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,44,90,283కు చేరాయి. ఇందులో 4,39,13,294 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,139 మంది మృతిచెందారు. మరో 48,850 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 6322 మంది వైరస్‌ నుంచి బయటపడగా, 16 మంది మరణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement