Monday, May 6, 2024

అనుమానాస్ప‌ద స్థితిలో విద్యార్థి మృతి.. వార్డెన్ పై సస్పెన్షన్ వేటు

కామారెడ్డి జిల్లా బీర్కూర్ బీసీ బాలుర వసతి గృహంలో విషాదం చోటుచేసుకుంది. హాస్ట‌ల్ లో ఉంటున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విష‌యం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత హాస్ట‌ల్‌ వార్డెన్ సందీప్ ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. వసతి గృహంలో ఉన్న విద్యార్థి వార్డెన్ నిర్లక్ష్యం వల్ల మృతి చెందినందున అతడిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు. విద్యార్థి మృతి పై ఉన్నతాధికారులతో విచారణ చేయిస్తామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement