Thursday, May 16, 2024

తెలంగాణలో కరోనా విధ్వంసం – 24 గంటల్లో 18 మంది మృతి

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి రెట్టింపవుతుంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 5926 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,61, 359కి చేరింది. కాగా అందులో 3,16,650 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

అలాగే ఇంకా 42,853 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మరోవైపు తెలంగాణలో కొత్తగా 18 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 1856 మంది మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement