Tuesday, April 30, 2024

తెలంగాణలో రెక్కలు విప్పుకున్న కరోనా!

తెలంగాణలో కరోనా మహమ్మారి క్రమంగా విజృంభిస్తోంది. తాజాగా రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 965 కొత్త కేసులు నమోదవగా… ఐదుగురు కొవిడ్ తో మృతి చెందారు. ఈ కేసులతో ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 3,09,741కి చేరింది.

ప్రస్తుతం 6,159 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కేసులు నమోదు అవుతున్నాయి. అత్యధికంగా హైదరాబాద్ లో పరిధిలో నమోదు అయ్యాయి. జిహెచ్ఎంసి 254, మేడ్చల్ 110, రంగారెడ్డి 97, నిజామాబాద్ 64, నిర్మల్ 39, జగిత్యాల 35 కేసులు నమోదు అయ్యాయి. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement