Saturday, May 4, 2024

ఏపీలో కొత్తగా మరో 253 కరోనా కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా తీవ్రత రోజురోజు పెరుగుతుంది. పెరుగుతుంది. తాజాగా గ‌డిచిన 24 గంటల్లో 253 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 30,716 మందికి కరోనా నిర్దార‌ణ‌ పరీక్షలు నిర్వహించగా.. 253 మందిలో పాజిటివ్ గా నిర్ధారణ అయింది.మరోవైపు చికిత్స పొందుతూ ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

తాజా కేసుల‌తో కలిపి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 8,92,522కి చేరింది. అలాగే క‌రోనా కార‌ణంగా 7,186కు మంది మృతి చెందారు. మరోవైపు తాజాగా రాష్ట్రంలో 137 మంది కోలుకోన్నారు. కాగా ఈ మహమ్మారి నుంచి 8,83,642 మంది కొలుకున్నారు. ప్రస్తుతం 1,694 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement