Saturday, April 27, 2024

అదే స్పీడు…అదే జోరు…

ఏపీలో కరోనా మహమ్మారి అదే జోరు కొనసాగిస్తోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 175 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 40 కొత్త కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు ఈ మహమ్మారి నుంచి 132 మంది కొలుకున్నారు. అలాగే ఇద్దరు మృతి చెందారు.

తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,91,563కి చేరింది. అలాగే ఇప్పటి వరకు 8,83,113 మంది కరోనా నుంచి కోలుకుని డిచార్జ్ కాగా 1,268 మంది చికిత్స పొందుతున్నారు.అలాగే కొత్తగా నమోదు అయిన మృతుల తో కలిపి మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,182కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement