Friday, April 26, 2024

నిర్మానుష్యంగా రహదారి


దేవరకద్ర :రోజు రోజుకు ఎండలు పెరుగుతూ ఉండటం వల్ల రోడ్లపై వాహనాలు మధ్యాహ్న సమయంలో సక్రమంగా తిరగడం లేదు. ప్రజలు కూడా ఎండలకు భయపడి ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం లేదు. వాహనదారులు గానీ , ప్రజలు గానీ ఏవైనా పనులు ఉంటే ఉదయం 9 గంటల వరకే చూసుకుంటున్నారు. తదుపరి ఎండలకు భయపడి బయటకు రాలేకపోతున్నారు. 32 డిగ్రీలు ఉండటం వల్ల ఇంకా రెండు నెలలు ఎండలు ఏ విధంగా ఉంటాయా అన్నది ఇప్పుడే ప్రజలు భయపడుతున్నారు. ఒకపక్క ఎండలు విపరీతంగా ఉన్నా కూడా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న కార్మికులు అలాగే ఎండలో పనులు చేస్తున్నారు. ఈ ఎండల వల్ల వడదెబ్బ సోకే ప్రమాదం ఉన్నదని అందుకు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement