Saturday, April 27, 2024

దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..

దేశంలో కొత్తగా 12,899 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,32,96,692కు చేరాయి. ఇందులో 4,26,99,363 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,855 మంది మృతిచెందారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్‌ కేసులు 72,474కు చేరాయి. కాగా, శనివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 15 మంది మహమ్మారికి బలవగా, 8,518 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు.

ఇక మొత్తం కేసుల్లో 0.17 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.62 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు 1,96,14,88,807 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement