హైదరాబాద్, ఆంధ్రప్రభ: మల్టిలెవల్ కారు పార్కింగ్ స్థలాల ఏర్పాటు అంశం తుది దశకు వచ్చిందని రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ చెప్పారు. కోయంబత్తూరు వెళ్లి మల్టిలెవల్ కారు పార్కింగ్ నిర్మాణాలను తమ బృందం పరిశీలించిందన్నారు.
మంత్రి కేటీ. రామారావు, ఎంపీ అసదొద్దిన్ ఓవైసీ సూచన మేరకు ఈ నిర్మాణాలపై అధ్యయనాన్ని పూర్తి చేశామన్నారు. త్వరలోనే రాష్ట్రంలో మల్టి లెవల్ కారు పార్కింగ్ స్థలాలను నిర్మిస్తామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.